Tuesday 24 October 2017

కన్యాశుల్కం కాలంలో...

18 వ శతాబ్ధపు మధ్యకాలంలో....!

    ఒకవైపు బ్రిటీష్ వాళ్ళు, మరొకవైపు కన్యాశుల్కం ఈ రెండింటి ప్రభావం వల్ల మన దేశం బానిస బ్రతుకు బ్రతుకుతుంది.. ఎక్కడ చూసినా తెల్లచీరె కట్టుకొని కనపడే పసిపిల్లలతో దేశం మొత్తం చిందర వందరగా వుంది.. 

సావిత్రి ...!    వెంకటయ్య ,మంగమ్మ గారి ఏకైక సంతానం..బాల్య  వివాహాలు ఎక్కువగా ఉండటం వలన 12 సంవత్సరాల వయస్సులోనే రంగయ్య అనే 70 సంవత్సరాల ముసలి వాడు అంతేకాకుండా మూడవ పెళ్లి వాడికి  ఇచ్చి పెళ్లి చేసాడు సావిత్రి తండ్రి వెంకటయ్య..( ఆ కాలంలో పిల్ల తండ్రి ముందుకి బానిష అయితే వారికి మందు ఆశ చూపించే వారు లేకపోతె ఎంతోకంత డబ్బు ని ఆశగా చూపించి వారి అమ్మాయిలను వివాహం చేసుకునేవారు )




  పెళ్ళైన నెల రోజుల నుండి రంగయ్య మంచాన పడ్డాడు ఆ రోజు నుండి అతనికి సేవ చెయ్యటానికే 2 సంవత్సరాల సమయం గడిచిపోయింది తర్వాత అనారోగ్యంతో అతను మరణించాడు..భర్త చనిపోయినప్పుడు కూడా సావిత్రి ఏడవలేదు  అసలు భర్త ,బాధ్యతలు అనే బంధాలు కూడా తెలియవు..భర్త చనిపోగానే సావిత్రిని విధవని చేసి తెల్లచీరె కట్టి ఇంట్లో కూర్చో పెట్టారు.. 

6 సంవత్సరాల తర్వాత..! 

      ఈ బాల్య వివాహాలు, కన్యాశుల్కం ప్రభావం విపరీతంగా పెరిగిపోతుంది..అప్పుడు అప్పుడే ప్రజలలోకొద్దికొద్దిగా  చైతన్యం మొదలయింది ఈ బాల్య వివాహాలను అరికట్టాలి అనే దిశగా.. 

శ్రీను ....!     26 సంవత్సరాల యువకుడు..ముఖంలో తేజస్సు..అపారమైన తెలివి తేటలు..ఎంతటి వారినైనా రెండు నిమిషాలు చూసి మనిషిని అంచనా వెయ్యగల దిట్ట.. పట్టణంలో బారిస్టారు పూర్తి చేసి  5 సంవత్సరాల తర్వాత ఊరికి తొలిసారిగా  తిరిగి వొచ్చాడు ..ఎప్పటినుండో ఈ బాల్య వివాహాల పట్ల అతను వ్యతిరేకతను చేస్తూనే ఉండేవాడు..కానీ తన ఊరిలో చిన్న చిన్న పిల్లలను విదవలుగా చూడగానే అతని గుండె చేదిరిపోయింది..ఈ మూఢనమ్మకాలను ఆపాలి అని కొద్దో గొప్పో చదువుకున్న వారికి హితోపాదేశం చేసి ఒక పది మందితో కలిసి చిన్న గ్రూప్ లాంటిది ఏర్పాటు చేసుకొని ప్రతి ఊరు తిరుగుతూ ఈ మూఢనమ్మకాల ప్రభావాన్ని వివరిస్తూ దీని వల్ల భవిష్యత్తులో జరిగే పరిణామాలు గురించి వివరిస్తూ అందరిని చైతన్య వంతులను చెయ్యటం మొదలుపెట్టాడు..  

వీరి ఉద్యమం చాలా మందిని చైతన్య వంతులను చేయసాగింది ..అలా ఊరు ఊరు తిరుగుతూ ఉండగా ఒక ఊరిలో చూసాడు సావిత్రిని..గుండ్రటి ముఖం,నల్లని కలువల లాంటి కళ్లు,నడకతో పాటు ఒయ్యారంగా ఊగుతున్న ఒతైన జడ,ఎంతటి వారినైనా ఒకే నవ్వుతో పడేసే చిరునవ్వు..వీటి అన్నిటికి విరుద్దంగా తాను కట్టుకున్న తెల్లని చీరె..ఒక్క నుదిటిన బొట్టు తప్ప దేనిలోను అప్సరసలకి తీసిపోదు..వీరి ఇరువురి చూపులు కలుసుకున్నాయి సావిత్రి వెంటనే సిగ్గుతో లోపలికి వెళ్లిపోయింది..అమ్మాయిలకు పెళ్లి పట్ల ఎన్నో ఊహలు ఉంటాయి అవన్నీ ఎలాగూ తీరలేదు భర్త చనిపోయాక వేరే వారికి కన్నెత్తి చూసే అవకాశం లేదు మొదటి సారిగా శ్రీను ని చూడగానే ఎదో తెలియని అనుభూతి.. 

  ఇది ఇలా ఉండగా మరోపక్క తమ ఆచారాన్ని మంటగలుపుతున్నారు  అని  అక్కడ పెద్దమనుషులు అనే పేరు పెట్టుకున్న వారు కూడా ఒక గ్రూప్ గా ఏర్పడి ఇది మన హక్కు అని చెపుతూ  బాల్య వివాహాల లాంటి మూఢనమ్మకాలను ప్రోత్సహించటం మొదలుపెట్టారు ...
మూఢనమ్మకాలకు విరుద్ధంగా పోరాటం చేసేవారు మూఢనమ్మకాలను ప్రోత్సహించే వారితో  పోరాటాలు తారాస్థాయిలో జరుగుతున్నాయి..

కానీ ఇంతలోనే...! 

next episode will be updated soon 



                                                                                                                        రచన 

                                                                                                               రఘు చౌదరి 

No comments:

Post a Comment

ఛాయ్ విలేజ్

సాయంత్రం 6 గంటల సమయం.. ఆ రోజు ఎందుకో నాలో ఏవో అంతుచిక్కని ఆలోచనలు నా మెదడును తొలిచేస్తున్నాయి..ఈ ఆలోచనలతో ఉక్కిరిబిక్కిరి అవుతూ సరదాగా అలా...

most popular posts